'జగన్ సిఎం అయినా ఇలాగే సాక్షి'

సాక్షి దిన పత్రికలో వస్తున్న వార్తాకథనాలు నచ్చడం, నచ్చకపోవడం వారి వారి వ్యక్తిగతాభిప్రాయమని చెప్పింది. ప్రజల పక్షపాతం తీసుకున్నందుననే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు ఆదరించారని, ఇప్పుడు వైయస్ జగన్ ను ఆదరిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఒక పార్టీకి బాకాగా పత్రిక ఉండదని స్పష్టం చేసింది. ప్రజల పక్షాన నిలిచి ప్రజల ఆదరణ పొందామని చెప్పుకుంది. రాజకీయాల్లో ఉన్నవారికి సాక్షి నచ్చకపోవచ్చునని, ప్రజలతో మమేకమై, ప్రజల్లో ఒక్కరిగా తిరిగే వారికి ప్రజల ఆదరణ ఉంటుందని చెప్పుకుంది.
కడప జిల్లా ప్రజాపథం కార్యక్రమంలో రోశయ్య ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించింది. మరోసారి అప్పటి జగన్ ప్రసంగాన్ని సాక్షి టీవీ చానెల్ ప్రసారం చేసింది. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజలకు నష్టం చేసే విషయాలపై తాము రాశామని, ముఖ్యమంత్రి ఎవరన్నది ముఖ్యం కాదని, ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేదే గీటురాయి అని, వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయినా ఇలాగే ఉంటామని సాక్షి దినపత్రిక సమర్థించుకుంది. పసుపు పత్రికలకు, కొంత మంది రాజకీయ నాయకులకు పాక్షి ప్రజాపక్షపాతం గిట్టడం లేదని వ్యాఖ్యానించింది. కాంగ్రెసు పక్కన రాయాలని కొంత మంది అనుకుంటుండవచ్చు గానీ అది సాక్షి విధానం కాదని స్పష్టం చేసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications