వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'చిరంజీవికి వ్యవసాయమంటే తెలుసా?'

By Santaram
|
Google Oneindia TeluguNews

Guntur
తెనాలి: చంద్రబాబు నాయుడుపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవి విమర్శలు గుప్పించడం సబబు కాదని మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు అన్నారు. తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బస్సుయాత్రలో భాగంగా తెనాలిలో పర్యటించిన చిరంజీవి చంద్రబాబుపై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ, నటనలో చిరంజీవికి ప్రావీణ్యం ఉండొచ్చుగాని వ్యవసాయం, రైతుల గురించి ఏమన్నా తెలుసునా? ఎప్పుడన్నా దుక్కి దున్ని, గట్టు తొక్కి ఎరు గునా? అని ప్రశ్నించారు.

పోలవరం సాధన యాత్ర చేపట్టడం, ఇందులో రాజకీయం లేదనడం తనకూ సంతోషమేనని చెబుతూ టీడీపీపై విమర్శలు చేయడం మాత్రం అనుచితమన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగని అనలేదని, లాభకరంగా లేకుండా దండగ వస్తోందని మాత్రమే అన్నట్టు చెప్పారు. రైతులకు పరపతి సౌకర్యం సకాలంలో ఇవ్వాలని, గ్రామం యూనిట్‌గా పంటల బీమా అమలు, పంటలకు గిట్టుబాటు ధరల కల్పన డిమాండ్లతో తాము ఆందోళన చేస్తున్నట్టు తెలిపారు. రైతు ఎక్కడ కష్టాల్లో ఉంటే అక్కడకు చంద్రబాబు చేరుకుని ఆదుకుంటారని చెబుతూ గోదావరి జిల్లాల్లో, ఒరిస్సాలో వరదలను ప్రస్తావించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులపై ఆందోళన చేస్తోంది తమ పార్టీఏనని చెప్పారు. ఇవేవీ తెలియకుండా టీడీపీ, చంద్రబాబుపై అవాకులు, చెవాకులు మాట్లాడటం చిరంజీవికి తగదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X