వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాధించాల్సింది చాలా ఉంది: పిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: సాధించినదానితో సంతృప్తి చెందలేదని, సాధించాల్సింది చాలా ఉందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. తాము మీడియా మార్కులను పట్టించకోమని, ప్రజలే అసలు మార్కులేస్తారని ఆయన అన్నారు. నాలుగేళ్ల తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మీడియా మార్కులను తాము పట్టించుకోబోమని ఆయన అన్నారు. తాము యుపిఎ - 3 గురించి ఆలోచించడం లేదని ఆయన అన్నారు. నక్సలిజాన్ని తాము తక్కువ అంచనా వేయలేదని, అంతర్గత భద్రతకు మావోయిస్టులు పెద్ద సవాల్ గా నిలిచారని ఆయన అన్నారు. నక్సలిజాన్ని అదుపు చేయాలని రాష్ట్రాలు కోరుకుంటున్నాయని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని సహించబోమని, ఉక్కుపాదంతో అణచి వేస్తామని ఆయన చెప్పారు. జాతీయ భద్రతా విధానంలో మార్పులు తెస్తామని ఆయన చెప్పారు. పాకిస్తాన్ తో మెరుగైన సంబంధాలను కోరుకుంటున్నామని, శాంతి కోసమే పాకిస్తాన్ తో చర్చలను ప్రతిపాదిస్తున్నామని ఆయన చెప్పారు. పాక్, భారత్ ల మధ్య విశ్వాసం లేకపోవడమే సమస్య అని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకూడదని, తన భూభాగాన్ని అందుకు ఉపయోగించుకోనివ్వరాదని ఆయన అన్నారు.

ఆర్థిక మాంద్యం ప్రపంచాన్నంతా కుదిపేసిందని, మన దేశమే త్వరగా కోలుకున్నామని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే లక్ష్యమని ఆయన అన్నారు. డిసెంబర్ నాటికి ద్రవ్వోల్బణాన్ని 5 -6 శాతానికి తెస్తామని ఆయన చెప్పారు. 85 శాతం వృద్ధి రేటు సాధించడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ధరల పెరుగుదల పెద్ద సవాల్ గా మారిందని, ధరలను అదుపు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అభివృద్దిపైనే దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పారు. ఆహార భద్రతకు చట్టం తెస్తున్నట్లు ఆయన తెలిపారు. వరద, కరువు వల్ల ఆహార ధాన్యాల దిగుబడి తగ్గిందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని ఆయన చెప్పారు. స్పెక్ట్రమ్ లో అవినీతి జరగలేదని, మంత్రి రాజా సరిగానే వ్యవహరించారని ఆయన చెప్పారు. దానికి తానే బాధ్యుడ్ని అని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X