వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి: బాలకృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్‌ : రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు వస్తాయని సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ జోస్యం చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలతో కలిసి ఆయన శనివారం తెలుగుదేశం పార్టీ మహానాడుకు వచ్చారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబుల ఫొటో ప్రదర్శనను ఆయన తిలకించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని, ఈ స్థితిలో మధ్యంతర ఎన్నికలు తప్పవని ఆయన అన్నారు. మధ్యంతర ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

తామంతా కలిసే ఉన్నామని ఆయన చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తమ నాన్న స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని ఆయన చెప్పారు. మహానాడు వేదికపై చంద్రబాబుకు ఓ వైపు బాలకృష్ణ, మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ కూర్చున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X