హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పక్కా ప్లాన్ ప్రకారమే సిఎంపై జగన్ వ్యాఖ్యలు: కాంగ్రెసు మంత్రులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్‌: ఒక పథకం ప్రకారమే తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి కె. రోశయ్యపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెసు శాసనసభ్యులు విమర్శించారు. మర్రి శశిధర్ రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, ఎరాసు ప్రతాప రెడ్డి తదితర శాసనసభ్యులు మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి కూడా శాంతిభద్రతలను స్వయంగా ఉల్లంఘించారని విమర్శలు ఎదుర్కోబోరని వారన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, రాష్ట్ర మంత్రుల మాటలను పెడచెవిన పెట్టి జగన్ వరంగల్ జిల్లా ఓదార్పు యాత్రను చేపట్టారని వారన్నారు. జగన్ పై ఏ విధమైన చర్యలు తీసుకోవాలో పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని వారన్నారు.

జగన్ రాజకీయ అనుభవం, అవగాహన లేకనే ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్‌ సీనియర్‌నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. వరంగల్‌జిల్లాలో ఓదార్పుయాత్ర వద్దని పార్టీ అధిష్ఠానం ఆదేశించినా మొండిగా వ్యవహరించాడని ఆరోపించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మొయిలీ మాటలను కూడా పట్టించుకోకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రోశయ్యపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X