హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2014 వరకు రోశయ్యే ముఖ్యమంత్రి: హనుమంతరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: 2014 వరకు ముఖ్యమంత్రిగా రోశయ్యనే కొనసాగుతారని కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. వచ్చే ఎన్నికల వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన చెప్పారు. తనకు పార్టీ అధిష్టానం రాజ్యసభ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో తాను ముఖ్యమంత్రి రోశయ్యను కలిసినట్లు ఆయన తెలిపారు. రోశయ్యతో భేటీ తర్వాత ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనను మూడో సారి రాజ్యసభ అభ్యర్థిగా నిర్ణయించినందుకు పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన చెప్పారు.

రాజ్యసభ సభ్యుడిగా తాను గ్రామగ్రామాన తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. తనకు రాజ్యసభ టికెట్ లభించడం కార్యకర్తల విజయమని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలో రాకుండా అడ్డుకోవాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X