అధిష్టానంపై ధిక్కారానికి వైయస్ జగన్ సిద్ధం

YS Jagan
హైదరాబాద్: పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించే ఉద్దేశంతోనే కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 8వ తేదీ నుంచి ఓదార్పు యాత్రను చేపట్టి తీరాల్సిందేనని ఆయన పట్టుబట్టి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈలోగా పార్టీ అధిష్టానం అనుమతి ఇస్తే సరి, లేదన్నా తన యాత్ర ఆగదని ఆయన చెబుతున్నట్లు సమాచారం. తాను మాట ఇచ్చాను కాబట్టి నెరవేరి తీరాల్సిందేనని, విశ్వసనీయతే ముఖ్యమని జగన్ అంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం గీసిన గీతను దాటడం ద్వారా ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడానికి కూడా ఆయన సిద్ధపడే ఉన్నట్లు చెబుతున్నారు.

కాగా, అధిష్టానం అనుమతి వచ్చిన తర్వాతనే యాత్ర చేపట్టడం మంచిదని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు, నాయకులు అంటున్నారు. పార్టీని కాదని తాము జగన్ కు సహకరించే పరిస్థితి లేదని అంటున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని వారు జగన్ తో స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రలో జగన్ కు పార్టీ నాయకులు ఏ మేరకు సహకరింస్తారనేది సందేహంగానే ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు జగన్ యాత్రకు దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+