వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Mahaboob Nagar
మహబూబ్‌ నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఇటిక్యాల మండలం కోదండపూర్‌ వద్ద మినీవ్యాన్‌ కల్వర్టును ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన నలుగురిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

నిన్న ఇదే జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్ళు మరణించారు. జాతీయ రహదారిపై గల అన్నసాగర్‌ గ్రామం వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోతుల మడుగు తండాకు చెందిన నార్యనాయక్‌ (36), విద్యాలక్ష్మి(15) అక్కడిక్క డే మృతి చెందారు. పోతుల మడుగు తండాకు చెందిన వీరు అన్నసాగర్‌లోని రైస్ ‌మిల్లు వద్దకు బియ్యం తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. రోడ్డు దా టుతుండగా హైదరాబాద్‌ నుంచి అనంతపురం వెళ్తు న్న ఓ కారు ఢీకొనడంతో తండ్రి, కూతురు అక్కడిక్కడే మృతి చెందారు. విద్యాలక్ష్మి మండలంలోని అమిస్తాపూర్‌లో గల కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X