మొయిలీ బెదిరించలేదు, మేం బెదరం కూడా: పాల్వాయి

పొన్నాల లక్ష్మయ్య మూటలు మోసుకెళ్లాడని తాము ఆరోపించలేదని, నీటి పారుదల శాఖ ఇంచార్జీ కాబట్టి పోలవరం డిజైనింగ్ అలా జరగందనే విషయం పొన్నాల చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పోలవరం విషయంలో అధికారులు అలా వ్యవహరించారా, ఏదైనా అదృశ్య శక్తి ఉందా అనేది ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో తేలుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా రోశయ్య పూర్తి కాలం ఉంటారని, రోశయ్యకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. అవినీతిరహిత, పారదర్శక ప్రభుత్వాన్ని తాము అందిస్తామని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన అన్నారు. తాము ఎన్నో మంచి పనులు చేసినా గత ఎన్నికల్లో సీట్లు తగ్గాయని, అది మీడియా వల్లనే జరిగిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications