వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎదురు 'గాలి': ఎన్నికల కమిషన్ నోటీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంలో భాగంగా ఉంటూ, ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తూ అక్రమంగా గనులు తవ్వుకుంటున్న మత్రులు గాలి జనార్దనరెడ్డి సోదరుల వ్యవహారంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. రాజ్యాంగంలోని అనర్హతల నిబంధన 192(2) కింద వారి శాసన సభ్యత్వాల్ని రద్దు చేయాలంటూ అందిన పిటిషన్‌పై వారికి సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. ఫిర్యాదులోని అంశాలకు సమాధానం ఇవ్వాలని ముగ్గురు రాష్ట్ర మంత్రులు గాలి జనార్దనరెడ్డి, గాలి కరుణాకర్‌ రెడ్డి, శ్రీరాములును ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందాయి. నోటీసులను రిజిస్టర్డు పోస్టు ద్వారా కాకుండా స్వయంగా మంత్రుల చేతికిచ్చి, ముట్టినట్లు రసీదు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కనీసం మంత్రుల పీఏలకు కూడా వీటిని ఇవ్వరాదని స్పష్టం చేసింది.

"ఆదివారం బెంగళూరులోనే వీటిని మంత్రులకు అందజేయాలని మా సిబ్బంది ప్రయత్నించినా కుదరలేదు. సోమవారం ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు వారు వస్తారని భావిస్తున్నాం. రానిపక్షంలో బళ్లారి కలెక్టర్‌ ద్వారా వీలైనంత త్వరగా అందజేస్తాం" అని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. "నోటీసులు సీల్డ్‌ కవర్లలో ఉన్నందున సారాంశం మాకు తెలియదు. పేజీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. శాసన సభ్యత్వం నుంచి ఎందుకు తొలగించరాదో సంజాయిషీ అడిగి ఉంటారు" అన్నారు. సంజాయిషీ వ్యవధి వారం రోజులు ఉండవచ్చని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X