హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపి నేత కిషన్ రెడ్డి నిరవధిక నిరశన దీక్ష షురూ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: విద్యార్థుల ఫీజుల రీయంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సోమవారం ఉదయం నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద యెత్తున తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫీజుల రీయంబర్స్ మెంట్ బాకీలను వెంటనే చెల్లించాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ నిర్ణయం మేరకే తాను నిరశన దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష సాగిస్తున్న బిసి సంఘం నేత ఆర్. కృష్ణయ్యకు కిషన్ రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రతిపక్షాలు ఎంతగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తప్పనిసరి పరిస్థితిలోనే తాను దీక్షకు దిగుతున్నానని ఆయన చెప్పారు. ప్రభుత్వం దిగి రాకపోతే తమ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని ఆయన హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X