హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయ ప్రయోజనాల కోసమే నిరాహార దీక్షలు: మంత్రులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sridhar Babu
హైదరాబాద్‌: విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు సంబంధించి బకాయిలన్నింటినీ చెల్లిస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా కొందరు నిరాహార దీక్షలు చేయడం తగదని మంత్రులు శ్రీధర్‌బాబు, మోపిదేవి వెంకటరమణ అన్నారు. నిరాహార దీక్షలతో రాజకీయం చేయడమేనని వారు వ్యాఖ్యానించారు. రెండు రోజుల్లో బకాయిలు విడుదలవుతున్న పరిస్థితుల్లో పేరు తెచ్చుకునేందుకే ఇలాంటి యత్నాలు చేస్తున్నారని వారు ఆక్షేపించారు. యాజమాన్యాల కోసం దీక్షలు చేస్తున్న వారి గురించి విద్యార్థులు ఆలోచించాలని సూచించారు.

విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజుల రీయంబర్స్ మెంట్లపై బిసి సంఘం నేత ఆర్. కృష్ణయ్య నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. కాగా, బిజెపి నేత జి. కిషన్ రెడ్డి సోమవారం పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X