విశాఖ వుడా బీచ్, లైట్ హౌస్ లకు కొత్త కళ
టికెట్ కొనలేనివారు కూడా పార్క్ పక్కగా ఉన్న దారిలో బీచ్కు చేరుకునేవారు. ఎంజీఎం నిర్మాణంతో పార్క్లో నుంచి బీచ్కు వెళ్లేమార్గం మూసుకుపోయింది. పక్కన ఉన్న దారికి అడ్డంగా గోడ కట్టేయడంతో వుడా బీచ్ నగర వాసులకు దూరమైంది. కొత్త వుడా పార్క్ నుంచో, వైఎంసీఏ ఎదురుగా ఉన్న బీచ్లో నుంచో దారి ఉన్నా వెళ్లడం కష్టమైపోయింది. కొత్త వుడా పార్క్ కింద దోబీఖానాలు నిర్మించడం, వైఎంసీఏ ఎదురుగా ఉన్న బీచ్దారిని కొన్ని వ్యాపార సంస్థలు కబ్జాచేసి ఫెన్సింగ్, సక్యూరిటీలను ఏర్పాటు చేయడంతో పర్యాటకులు, సందర్శకులు వుడా బీచ్ను దాదాపుగా మర్చిపోయారు.
సీఆర్జడ్ నిబంధనల ప్రకారం బీచ్ దారులు మూసేయరాదంటూ ఫిర్యాదులు రావడంతో వుడా ఉపాధ్యక్షుడు బి.శ్రీధర్ సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో శనివారం ఈ బీచ్ ను సందర్శించిన శ్రీధర్ అప్పటికప్పుడే బీచ్కు అడ్డుగా ఉన్న గోడలను తొలగించారు. దారి ఏర్పాటు చేశారు. వుడా పార్క్కు, పార్క్ హోటల్ కు మధ్య ఉన్న మార్గంలో లైటింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు.
లైట్ హౌస్కు కొత్త కళ: వుడా బీచ్తోపాటు ఇక్కడి లైట్ హౌస్ కూడా సందర్శకులను అలరించనుంది. విశాఖ పోర్టు ట్రస్ట్కు చెందిన వాడుకలో లేని ఈ లైట్హౌస్ను పర్యాటకుల సందర్శనకు అనుకూలంగా తీర్చిదిద్దే పనులు ప్రారంభమయ్యాయి. లైట్ హౌస్ చుట్టూ పార్క్ను అభివృద్ధి చేయాలని వుడావీసీ అదేశాలు జారీ చేశారు.