డి శ్రీనివాస్ పై భగ్గుమన్న కె చంద్రశేఖర రావు

డిసెంబరు 9న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణను అడ్డుకున్న మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడేనని, ఆయన రోశయ్యతో కూడబలుక్కుని రాజీనామాలు చేయించారన్నారు. శాసనసభ సాక్షిగా టిడిపి, కాంగ్రెస్ నేతలు కలిసిపోయారనీ ఆయన అన్నారు. తెలంగాణను ముంచేందుకు వారు ఎంతకైనా సిద్ధపడతారనడానికి ఇదో నిదర్శనమన్నారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి ఏం ముఖం పెట్టుకొని పోటీ చేస్తాయని ప్రశ్నించారు. ప్రజలకు వీరేం సమాధానం చెప్తారన్నారు. తెలంగాణకు ఇక్కడున్న దద్దమ్మ నేతలే శాపమన్నారు. తెలంగాణలో ఉన్న వాల్మీకి బోయలు బీసీలుగా ఉన్నారని, అదే ఆంధ్రలో ఎస్టీలుగా గుర్తింపు ఇచ్చారని, తెలంగాణలో మాలి కులస్థులను బీసీలుగా, ఆంధ్రలో ఎస్సీలుగా గుర్తించారన్నారు. తెలంగాణ ఏర్పడితే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు వస్తాయన్నారు. పోలవరం డిజైన్ మార్చాలని ఆంధ్రప్రాంత ఇంజనీర్లు సైతం చెబుతున్నా, ముఖ్యమంత్రి రోశయ్య మాత్రం సాధ్యం కాదనడం దారుణమన్నారు. కార్యక్రమంలో కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తదితరులు పాల్గొన్నారు.
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications