డి శ్రీనివాస్ పై భగ్గుమన్న కె చంద్రశేఖర రావు

డిసెంబరు 9న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణను అడ్డుకున్న మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడేనని, ఆయన రోశయ్యతో కూడబలుక్కుని రాజీనామాలు చేయించారన్నారు. శాసనసభ సాక్షిగా టిడిపి, కాంగ్రెస్ నేతలు కలిసిపోయారనీ ఆయన అన్నారు. తెలంగాణను ముంచేందుకు వారు ఎంతకైనా సిద్ధపడతారనడానికి ఇదో నిదర్శనమన్నారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి ఏం ముఖం పెట్టుకొని పోటీ చేస్తాయని ప్రశ్నించారు. ప్రజలకు వీరేం సమాధానం చెప్తారన్నారు. తెలంగాణకు ఇక్కడున్న దద్దమ్మ నేతలే శాపమన్నారు. తెలంగాణలో ఉన్న వాల్మీకి బోయలు బీసీలుగా ఉన్నారని, అదే ఆంధ్రలో ఎస్టీలుగా గుర్తింపు ఇచ్చారని, తెలంగాణలో మాలి కులస్థులను బీసీలుగా, ఆంధ్రలో ఎస్సీలుగా గుర్తించారన్నారు. తెలంగాణ ఏర్పడితే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు వస్తాయన్నారు. పోలవరం డిజైన్ మార్చాలని ఆంధ్రప్రాంత ఇంజనీర్లు సైతం చెబుతున్నా, ముఖ్యమంత్రి రోశయ్య మాత్రం సాధ్యం కాదనడం దారుణమన్నారు. కార్యక్రమంలో కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications