వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారై భర్త నిర్వాకం: న్యూజిలాండ్ వీధిన పడిన మహేశ్వరి

By Pratap
|
Google Oneindia TeluguNews

New Zealand
విశాఖపట్నం: మరో ఎన్నారై భర్త నిర్వాకం వెలుగులోకి వచ్చింది. భార్యను దేశం కాని దేశంలో వీధిలో వదిలేసి స్వదేశం తిరిగొచ్చిన భర్త కిరాకత చర్య బయటపడింది. వెంకటవర ప్రసాద్ అనే ప్రవాసాంధ్రుడు తన భార్య మహేశ్వరిని చిత్రహింసలు పెట్టి, న్యూజిలాండ్ వీధుల్లో పడేసి స్వదేశం తిరిగొచ్చాడు. దిక్కు మొక్కులేని మహేశ్వరిని ఓ గుజరాతీ మహిళ ఆదుకుంది. ఆమెను గుజరాతీ మహిళ స్వదేశానికి పంపించింది. విశాఖపట్నానికి చేరుకున్న మహేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటవర ప్రసాద్ పరారీలో ఉన్నాడు. మహేశ్వరి అత్తమామలను పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్వరికి, వెంకటవరప్రసాద్ లకు 2007లో పెళ్లయింది. పెళ్లియిన తర్వాత తనను న్యూజిలాండ్ తీసికెళ్లాడని, అయితే చిత్రహింసలు పెడుతూ వచ్చాడని మహేశ్వరి ఆరోపిస్తోంది. న్యూజిలాండ్ లో ఎన్నారై భర్తల భార్యల పరిస్థితి దారుణంగా ఉందని ఆమె అంటోంది. భార్యలను వదిలేసి మరో మహిళలతో వెళ్లిపోవడం అక్కడ సాధారణంగా జరుగుతోందని ఆమె అంటోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X