నిత్యానందకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారి అరెస్టు
ప్రస్తుతం ఆమె బెంగళూరు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. స్వామీజీతో సన్నిహితంగా ఉండడంపై ఆమె స్పందిస్తూ ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, వేరే మహిళ అని పేర్కొన్నారు. దీంతో నిత్యానందకు వ్యతిరేకంగా మళ్లీ నిరసన జ్వాలలు ప్రారంభమయ్యాయి. సేలంలో శని వారం దళిత ప్రజల సంస్థ ఆధ్వర్యంలో నిత్యానంద పోస్టర్లను చింపి ఆందోళనకు దిగారు. సేలం పాత కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనలో ఆ సంస్థ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామీజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సంస్థకు చెందిన న్యాయవాది ముత్తుస్వామి కొత్త ముత్తు, తంగదురై, తంగవేలు, పొన్నుస్వామి, గోవిందన్ సహా 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Story first published: Sunday, July 25, 2010, 16:36 [IST]