చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిత్యానందకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారి అరెస్టు

By Santaram
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
చెన్నై: నిత్యానందకు వ్యతిరేకంగా శనివారం సేలంలో ఆందోళన చేపట్టిన 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నటి రంజితతో నిత్యానంద రాసలీలలు జరిపినట్లు టీవీల్లో ప్రదర్శితమైన వీడియో క్లిప్పింగ్‌లు సంచలనం రేపిన విషయం విదితమే. ఆ నాటి నుంచి పరారీలో ఉన్న నిత్యానందను పోలీ సులు ఇటీవల అరెస్ట్‌ చేశారు. 53 రోజులు జైల్లో ఉన్న స్వామీజీ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన సాక్షి అయిన రంజిత పోలీసుల ఎదుట హాజరుకాకుండా న్యాయవాదుల ద్వారా నోటీసులు పంపుతున్నారు.

ప్రస్తుతం ఆమె బెంగళూరు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. స్వామీజీతో సన్నిహితంగా ఉండడంపై ఆమె స్పందిస్తూ ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, వేరే మహిళ అని పేర్కొన్నారు. దీంతో నిత్యానందకు వ్యతిరేకంగా మళ్లీ నిరసన జ్వాలలు ప్రారంభమయ్యాయి. సేలంలో శని వారం దళిత ప్రజల సంస్థ ఆధ్వర్యంలో నిత్యానంద పోస్టర్లను చింపి ఆందోళనకు దిగారు. సేలం పాత కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనలో ఆ సంస్థ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామీజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సంస్థకు చెందిన న్యాయవాది ముత్తుస్వామి కొత్త ముత్తు, తంగదురై, తంగవేలు, పొన్నుస్వామి, గోవిందన్‌ సహా 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X