ఇరాక్ బాంబు దాడుల్లో 40 మంది మృతి, 68 మందికి గాయాలు

Iraq
బాగ్దాద్‌: ఇరాక్‌లోని కర్బాల పట్టణంలో జరిగిన రెండు కారు బాంబు దాడుల్లో 40 మంది పౌరులు మృతి చెందారు. దాదాపు 68 మంది గాయపడ్డారు. షియాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. మతపరమైన ఉత్సవాల కోసం పెద్దయెత్తున షియాలు గుమిగూడారు. ఆ షియా యాత్రికులపై దాడులు జరిగాయి. మార్చిలో ఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పటివరకు ఇరాక్ ‌లో ప్రభుత్వం ఏర్పడకపోవడం ఇటువంటి ఘటనలకు కారణమవుతోందని భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో వందల మంది మరణించారు.

తొలి బాంబు పేలుడులో 18 మరణించారు. ఆ పేలుడు సంభవించిన కొద్ది నిమిషాలకే ఆ ప్రాంతానికి కేవలం 300 అడుగుల దూరంలో మరో పేలుడు సంభవించిది. ఈ సంఘటనలో 22 మంది మృతి చెందారు. అంతకు ముందు సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+