వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్లీ ప్రాజెక్టుపై ప్రధాని ఏ మాటా ఇవ్వలేదు, చిత్తుశుద్ధి లేదు: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: బాబ్లీపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రతిస్పందనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాబ్లీ సమస్య పరిష్కారం విషయంలో ప్రధానికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్సించారు. బాబ్లీపై ప్రధానితో జరిగిన అఖిల సమావేశంతో మిగతా పార్టీల నాయకులు, ముఖ్యమంత్రి రోశయ్య సంతృప్తి వ్యక్తం చేయగా తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆసంతృప్తి వ్యక్తం చేసింది. బాబ్లీ సమస్య అంతర్రాష్ట్ర వివాదమని, కేంద్రం ఏం చేస్తోందని చంద్రబాబు అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీ ఆదేశాలను కానీ, ముఖ్యమంత్రుల ఒప్పందాలను కానీ, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కానీ అమలు చేయడంలేదని, దీని గురించి చెబితే ప్రధానమంత్రి తనకు సాంకేతిక అంశాలు తెలియవని, అధికారులతో మాట్లాడి తెలుసుకుంటానని ప్రధాని చెప్పారని ఆయన అన్నారు.

తాము ఇదివరకు రెండుసార్లు వినతిపత్రాలు సమర్పించామని, మరో రెండుసార్లు అఖిలపక్ష బృందం వచ్చి సమస్యను వివరించిందని, కానీ ఇంతవరకూ ఆయనకు సమస్యను తెలుసుకొనేందుకు అధికారుల సమావేశం ఏర్పాటుచేసుకొనే సమయం కానీ ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసే వెసలుబాటుకానీ లేకపోయిందని ఆయన అన్నారు. బాబ్లీ విషయంలో ప్రధానమంత్రి దేనిపైనా హామీ ఇవ్వలేదని, ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేస్తామని మాత్రం చెప్పారని, తేదీ అడిగితే ప్రధాని నుంచి కచ్చితమైన సమాధానం రాలేదని, దీన్ని బట్టి ఆయన ఈ అంశాన్ని సాగదీయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. తమను ఐదు రోజుల పాటు మహారాష్ట్ర పోలీసులు నిర్బంధిస్తే దాన్ని ప్రధాని ఖండించలేదని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X