శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో ఆంధ్ర యువకుడి అనుమానాస్పద మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
శ్రీకాకుళం: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణానికి చెందిన పైడి హేమంత్‌ కుమార్‌ (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 12న ఓ స్విమ్మింగ్‌ పూల్‌ లో ఇతని మృతదేహం లభ్యమైనట్లు తల్లిదండ్రులు చెప్పారు. ఈ సమాచారం ఈ నెల 15న అందిందని తెలిపారు. మృతదేహం ఇంకా అక్కడి పోలీసుల ఆధీనంలోనే ఉండిపోయింది.

హేమంత్‌ 2006లో సత్యం కంప్యూటర్స్‌లో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీరుగా చేరాడు. మహేంద్ర సత్యం కంప్యూటర్స్‌ ద్వారా 2009 నవంబరులో వాషింగ్టన్‌ కు వెళ్లాడు. తండ్రి సూర్యనారాయణ ఆమదాలవలసలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. తల్లి ఉషారాణి (ఝాన్సీ) గృహిణి. మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు మహేంద్ర సత్యం సంస్థ నుంచి ఓ బృందం వాషింగ్టన్‌ వెళ్లిందని సూర్యనారాయణ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X