జగన్ పై జెలసీతో కొందరు కత్తి గట్టారు: అంబటి రాంబాబు

Ambati Rambabu
కాకినాడ: ఓదార్పు యాత్రకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కొంత మంది కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై కత్తి కట్టారని పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన అంబటి రాంబాబు విమర్శించారు. జగన్ కు జనాదరణ పెరుగుతుండడం చూసి ఓర్వలేక మీడియా జగన్ కు వ్యతిరేకంగా అభూతకల్పనలు రాయిస్తున్నారని ఆయన గురువారం ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. కాకినాడలో ఓదార్పు ముగింపు సభను బలప్రదర్శనకు వాడుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు యాత్ర ముగుస్తున్నందున జగన్ ను పరామర్సించడానికి ఎక్కువ మంది శాసనసభ్యులు, నాయకులు వస్తున్నారని ఆయన అన్నారు.

కాకినాడ ముగింపు సభలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేస్తారనే ప్రచారంలో కూడా నిజం లేదని ఆయన చెప్పారు. మీడియా పని కట్టుకుని కాకినాడ ముగింపు సభలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేస్తారని ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. ముగింపు సభ సాదాసీదాగా జరుగుతుందని ఆయన అన్నారు. జగన్ ఇంకా 19 జిల్లాలు పర్యటించాల్సి ఉందని, తూర్పు గోదావరి జిల్లా యాత్ర తర్వాత కొంత వ్యవధి తీసుకుని మిగతా జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+