రామోజీ ఈనాడు డైలీపై సాక్షి డైలీ ఎదురు దాడి

దొంగ నోట్ల కేసులో నిందితుడు రామకృష్ణ గౌడ్ తో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు దిగిన ఫొటోను ప్రచురించింది. దొంగెవరు, దొరెవరు అని వ్యాఖ్యానించింది. సుజనా చౌదరి, సిఎం రమేష్, నామా నాగేశ్వర రావులతో చంద్రబాబు ఫొటోను ప్రచురించి వారు ఎవరికి బినామీలంటూ ప్రశ్నించింది. వారికి ఎంపి సీట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేసింది. మంత్రులతో సమానంగా వారి సరసన ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు రామోజీరావుకు పీటం వేసిన విషయాన్ని ఫొటో ద్వారా గుర్తు చేసింది. రామోజీరావు పత్రికను నడుపుతున్నది ప్రజల కోసమా, పాలకులను శాసించడానికి అని సాక్షి దినపత్రిక తన వార్తాకథనంలో ప్రశ్నించింది. స్విస్ బ్యాంకులకు సంబంధించి, ఇతర వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సాక్షి ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది.












Click it and Unblock the Notifications