చిరంజీవికి మహిళారాజ్యం నేత శోభారాణి మెగా షాక్
చిరంజీవి చుట్టు ఉన్న ఆ నలుగురు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని శోభారాణి విమర్శించారు. కాని 'ఆ నలుగురు' ఎవరో ఆమె చెప్పలేదు. ప్రతిపక్ష పార్టీగా పీఆర్పీ పూర్తిగా విఫలమైందని, పార్టీ ప్రధాన ఎజెండాగా పేర్కొన్న సామాజిక న్యాయాన్ని చిరంజీవి పూర్తిగా విస్మరించారని ఆమె అన్నారు. బడుగు వర్గాల అభివృద్ధికోసం పీఆర్పీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని, విధివిధానాల్లో కూడా ఏ మాత్రం స్పష్టత లేదని శోభారాణి అన్నారు. మహిళలు ఈరోజున పార్టీ కార్యాలయానికి రాలేని పరిస్థితి వుందని ఆమె ఆవేదన వ్యక్త్తం చేశారు.
Comments
Story first published: Thursday, July 29, 2010, 16:23 [IST]