చిరంజీవికి పోటీ: తిరుమలకు టిడిపి నేతల పాదయాత్ర

పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానంలో అక్రమాలు, రాయలవారి నగల వ్యవహారం, తదితరవాటితో తిరుమల పవిత్రతకు వాటిల్లుతోందని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. ఆగస్టు 4 లేదా 5 తేదీల్లో ఈ యాత్రను నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బాబ్లీపై, ముఖ్యమంత్రి కె. రోశయ్య పనితీరుపై కూడా ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులతో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications