హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీకి చిరంజీవి ప్రాణం పోయడం సాధ్యమైనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: తన పార్టీకి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రాణం పోయగలరా అనేది సందేహంగానే ఉంది. కాంగ్రెసు అనుకూల వైఖరి, దేనిపైనా స్థిరంగా వ్యవహరించలేకపోవడం చిరంజీవికి ప్రాణసంకటంగా పరిణమించాయి. వీటిని అధిగమించడం చిరంజీవి వల్ల అయ్యే పనులేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి ప్రాణం పోయడానికి ఆయన ప్రజా చైతన్య యాత్రలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఐ ప్రజాచైతన్య యాత్రకు సన్నాహకంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశాలు జరుపుతున్నారు.

రోజుకు రెండు జిల్లాల నాయకులతో చిరంజీవి చర్చలు జరుపుతారు. సోమవారం ఉదయం నెల్లూరు, మధ్యాహ్నం చిత్తూరు, మంగళవారం ఉదయం కడప, మధ్యాహ్నం ఖమ్మం, బుధవారం ఉదయం శ్రీకాకుళం, మధ్యాహ్నం విజయనగరం జిల్లాల నాయకులతో చిరంజీవి సమావేశాలను తలపెట్టినట్లు పార్టీ కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడు జ్యోతులనెహ్రూ తెలిపారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న అన్ని జిల్లాల మహిళా నేతలు, కార్యకర్తలతో 5వ తేదీ ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X