వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్సార్ పథకాల ఘనత తెలుస్తోంది: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల ఘనత ప్రతిపక్షాల డిమాండ్లను బట్టి అర్థం చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. వైయస్ పథకాలను గతంలో విమర్శించిన ప్రతిపక్షాలు వాటిని అమలు చేయాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయని, దాన్నిబట్టి ఆ పథకాల ఘతన తెలిసి వస్తోందని ఆయన అన్నారు. బాబ్లీపై ప్రధాని మన్మోహన్ సింగ్ సమక్షంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనడానికి సోమవారం ఢిల్లీ వచ్చిన రోశయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బాబ్లీపై మన రాష్ట్ర వాదనను గట్టిగా వినిపిస్తామని ఆయన చెప్పారు.

హైకోర్టు తీర్పును, ట్రిబ్యునల్ నిర్ణయాలను, కేంద్ర ప్రభుత్వం సూచనలను పట్టించుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అంతర్రాష్ట్ర జలవివాదాల్లో దిగువ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని ప్రధానిని కోరుతానని ఆయన చెప్పారు. ప్రధాని సమక్షంలో బాబ్లీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుమలకు ఎవరు పాదయాత్ర చేసిన పవిత్రతకు భంగం కలగకుండా చూడాలని ఆయన అన్నారు. టిటిడి అక్రమాలు తమ దృష్టికి కూడా వచ్చాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X