హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మారిన పొలిటికల్ సీన్: చిరంజీవి వర్సెస్ వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ పరిణామాల దిశ మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలపై చేస్తూ వస్తున్న యుద్ధాన్ని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపైకి మళ్లించాల్సి వచ్చింది. ఎంత కాదన్నా చిరంజీవి తన ఆరోపణలను వైయస్ జగన్ ను ఉద్దేశించి చేశారన్నది స్పష్టం. బయ్యారం గనులు, జలయజ్ఞం వంటి వైయస్ పథకాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటి వరకు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఆమోస్ లాంటి కాంగ్రెసు సీనియర్ నాయకులు ఆ విషయాలు మాట్లాడుతూ వచ్చారు. జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. దాని వల్ల అది కాంగ్రెసు అంతర్గత పోరుగా ఉంటూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలను వైయస్ జగన్ వర్గం గానీ, ప్రభుత్వం గానీ పెద్దగా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు తప్ప ఎవరు ఆరోపణలు చేస్తారనే ఒక విధమైన ఉదాసీనత నెలకొంది.

చిరంజీవి ఆరోపణలు చేయడంతో వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. చిరంజీవి ఆరోపణలు గతంలో మాదిరిగా కాకుండా చాలా తీవ్రంగా ఉన్నాయి. దాంతో జగన్ వర్గం ఇరకాటంలో పడింది. పైగా చిరంజీవి కాంగ్రెసు పార్టీకి దగ్గరవుతూ వస్తున్నారు. జగన్ వల్ల జరిగే నష్టాన్ని చిరంజీవితో పూడ్చుకోవడానికి ఇప్పటికే కాంగ్రెసు అధిష్టానం ఓ అవగాహనకు వచ్చింది. ఆ రకంగా యుద్ధాన్ని జగన్, చిరులకు మధ్య జరిగే విధంగా కాంగ్రెసు అధిష్టానమే వ్యూహం రచించిందనే ప్రచారం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X