హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమాంధ్ర మంత్రులను డిస్మిస్ చేయాలి: జీవన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jeevan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని కోరడం దేశద్రోహమని శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చిన సీమాంధ్ర మంత్రులను డిస్మిస్ చేయాలని కాంగ్రెసు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మంత్రులపై తాము రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆ మంత్రులు దాన్ని ఉల్లంఘించారని ఆయన విమర్శించారు. ఒక ప్రాంతంవారిని దేశద్రోహులుగా పేర్కొనడం ద్వారా సీమాంధ్ర మంత్రులపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

గత తొమ్మిది నెలలుగా సీమాంధ్ర మంత్రులు తెలంగాణలో పర్యటించడం లేదని, కొత్తగా వారిని తిరగనివ్వకపోవడం అనే విషయం ప్రస్తావనకే రాదని ఆయన అన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే నైతిక స్థయిర్యం కూడా వారికి లేకుండా పోయిందని ఆయన అన్నారు. సీమాంధ్ర మంత్రులు పూర్తిగా నైతిక స్థయిర్యం కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి గాదె వెంకటరెడ్డి వితండ వాదం చేస్తారని ఆయన అన్నారు. అబద్ధాన్ని కప్పి పుచ్చుకోవడానికి మరో అబద్ధాన్ని గాదె వెంకట రెడ్డి చేస్తారని, అదే వితండ వాదమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X