హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్, చిరు సోనియా జపం ఏమిటో: ఎర్రబెల్లి దయాకర రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంటే రాజీనామా చేసిన వారిని ఇటీవలి ఉప ఎన్నికల్లో గెలిపించిందని తెలుగుదేశం తెలంగాణ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఈ సెంటిమెంట్ లో భాగంగానే రాజీనామా చేసినవారికి తమ పార్టీ కార్యకర్తలు కూడా మద్దతు పలికారని ఆనయ మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమకు చిత్తశుద్ధి లేకపోతే భవిష్యత్తులో కూడా ఇటువంటి ఫలితాలనే ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.

తమ పార్టీని బలహీన పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. దాన్ని సమర్థంగా ఎదుర్కుంటామని ఆయన అన్నారు. ఇటు కెసిఆర్, ఆటు చిరంజీవి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ జపం చేస్తున్నారని ఆయన అన్నారు. వారి రహస్య ఎజెండా ఏమిటో తెలియడం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X