కాశ్మీర్ లో శాంతి కోసం కృషి: ప్రధాని మన్మోహన్ సింగ్

దేశం కోసం ప్రాణాలర్పించిన జవాను అమరవీరులకు ప్రధాని జోహర్లు అర్పించారు. దేశ రక్షణలో సైనికుల కృషి ఎనలేనిదని కొనియాడారు. జమ్ముకాశ్మీర్ భారత్లో అంతర్భాగమని స్పష్టం చేశారు. కాశ్మీర్లో శాంతి కోసం ఎవరితోనైనా చర్చిస్తామని తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాదంపై పోరు జరపాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే ఇరుదేశాల చర్చల ప్రక్రియలో పురోగతి ఉండదని స్పష్టం చేశారు. పెరిగిన ధరలు సామాన్యుడికి భారంగా మారాయని ప్రధాని అంగీకరించారు. ధరలను త్వరలో అదుపు చేస్తామని జాతికి హామీనిచ్చారు. నక్సలిజం దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా మారిందని, నక్సల్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక సంఘం సమగ్ర విధానాన్ని రూపొందిస్తోందన్నారు. లెహ్లో సంభవించిన వరదలతో భారీ నష్టం జరిగిందని తెలిపారు. ఈ వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. నవభారత నిర్మాణం కోసం అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications