చంద్రబాబు నాయుడుపై ప్లీనరీలో మెగాస్టార్ చిరంజీవి ఫైర్

తనపై అపవాదులు సృష్టించారని, నిందలు వేశారని, అవమానించడానికి ప్రయత్నించారని, దెబ్బలు తగిలినవాడికి ఆ బాధేమిటో తెలుస్తుందని ఆయన అన్నారు. తాను సినీ రంగంలో మహారాజులా బతికానని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజల రుణం తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. రాజకీయాలు ముళ్లబాట అని తెలుసునని, అందుకు తాను సిద్ధపడ్డానని ఆయన అన్నారు. రెండేళ్లలో తాను చాలా నేర్చుకున్నానని ఆయన అన్నారు. మనలాంటి రాజకీయాల్లో ఉండాలని, లేకుంటే స్వార్థ రాజకీయాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
బ్లడ్ బ్యాంక్ తో ఎందరికో ప్రాణదానం చేశానని, ఐ బ్యాంకుతో ఎందరికో చూపునిచ్చానని, ప్రజా సేవ విషయంలో తనలోని అసంతృప్తి తొలగిపోలేదని ఆయన అన్నారు. లోపల అంతర్మథనం జరుగుతోందని, ఆ స్థితిలో తనను విపరీతంగా అభిమానించి ఈ స్థాయికి తనను తెచ్చిన ప్రజల రుణం తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని, ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన చెప్పారు. తమ బలమేమిటో తెలుసు కాబట్టే కాంగ్రెసు పార్టీ తమకు రెడ్ కార్పెట్ పరుస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications