షూటింగ్ వల్లనే పవన్ కళ్యాణ్ ప్లీనరీకి డుమ్మా కొట్టాడా?

కాగా, కర్నూలు జిల్లాకు చెందిన శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి కూడా ప్లీనరీకి రాలేదు. అలాగే, తెలంగాణకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు మహేశ్వర రెడ్డి, అనిల్ కుమార్ కూడా డుమ్మా కొట్టారు. తెలంగాణ ప్రాంత నేతలు ప్లీనరీలో కనిపించనే లేదు. చిరంజీవి సమైక్య నినాదం వల్ల తెలంగాణ ప్రాంత నేతలు పార్టీకి దూరమయ్యారని చెబుతున్నారు. అంతేకాకుండా ప్లీనరీ బుధవారం ఉదయం వెలవెలబోయింది. ఆశించిన స్థాయిలో ప్రతినిధులు రాలేదు. దీంతో చిరంజీవి కినుక వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజలకు దగ్గర కావాలన్నదే తమ అభిమతం తప్ప అధికార పార్టీకి దగ్గర కావాలనేది తమ అభిమతం కాదని చిరంజీవి అన్నారు. అధికారం కోసం తాను రాజకీయాల్లో రాలేదని ఆయన చెప్పారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications