రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, జలాశయాలు కళకళ

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జుక్కల్ఎర్రకుంటలో వర్షంతో 40 ఇళ్లు నీటమునిగాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 40 ఇళ్లల్లోని స్థానికులను జుక్కల్ ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. మహబూబ్నగర్ జిల్లా ఇటిక్యాలలో ఇంటిపైకప్పు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వర్షాలకు ఇల్లు నానడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. చిన్నారుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా, మహబూబ్ నగర్ జిల్లా ఐజలో వరదల్లో ఓ కారు, బైక్ కొట్టుకుపోయాయి. ఓ వ్యక్తి గల్లంతయినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని పలు కాలనీలు నీటిలో మునిగాయి. హైటెక్ సిటీ నుంచి పంజగుట్ట వరకు రోడ్లు నీటిలో మునిగిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోసాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనివల్ల రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. నిన్నటి నుంచి ఇప్పటివరకు అత్యధికంగా బాపట్లలో 11సెం.మీ., నర్సాపురంలో 6 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. అల్పపీడన ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 45 - 50 కి.మీ. వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications