మొయిలీ రాయబారం వేస్ట్: ఓదార్పునకే వైయస్ జగన్ సై

Veerappa Moily
కడప: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ధిక్కారానికే మొగ్గు చూపారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ రాయబారం ఫలించలేదు. గురువారం సాయంత్రం ఇడుపులపాయకు వచ్చిన వీరప్ప మొయిలీ వైయస్ కు నివాళులు అర్పించిన తర్వాత జగన్ తో చర్చలు జరిపారు. వైయస్ సతీమణి విజయమ్మను కూడా కూర్చోబెట్టి జగన్ కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే, జగన్ మొయిలీ మాట వినలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు తన యాత్రలో పాల్గొంటేనే మంచిదంటూ పార్టీ యావత్తూ తన బాటలోకే రావాలని జగన్ పరోక్షంగా సూచించారు. కావాలంటే ఆ తర్వాత పార్టీతో కలిసి ఓదార్పులో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తానంటూ చెప్పారు. పైగా తన ఓదార్పుతో పార్టీకి ప్రయోజనమేనంటూ సూత్రీకరించారు.

ఎంత చెప్పినా జగన్ వినిపించుకోకపోవడంతో. 'ఐ యామ్ హెల్ప్‌లెస్. ఇక నా చేతుల్లో ఏమీ లేదు' అంటూ, వీరప్ప మొయిలీ నిట్టూర్చారు. జగన్‌ను ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకొని హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్లిపోయారు. పార్టీ అవసరం తనకు ఎంత ఉందో, తన అవసరం కూడా పార్టీకి అంతే ఉందని జగన్ మొయిలీ వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తానికి జగన్ తన పట్టు వీడకపోవడంతో ఓదార్పు యాత్ర క్లైమాక్స్ కు చేరుకున్నట్లే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+