ఎమ్మార్ ప్రాపర్టీస్ పై నెపం చంద్రబాబు మీదికి నెట్టిన అంబటి రాంబాబు

కాంగ్రెసులోని వైయస్ వ్యతిరేక వర్గంతో కుమ్మక్కయి తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈనాడు దినపత్రికలో ఎమార్ ప్రాపర్టీస్ పై వచ్చిన వార్తాకథనాలను ఆయన తప్పు పట్టార. ఒక పత్రికలో వచ్చిన వార్తలను ప్రాతిపదికగా చేసుకుని డిమాండ్లు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంతరావు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎకరాలకు ఎకరాలు మింగితే తప్పు లేదు, తాము చేస్తే తప్పా అని ఆయన అడిగారు. వైయస్సార్ మరణం తర్వాత ఇన్నాళ్లకు ఆరోపణలు చేయడం దొంగలు పడిన ఆరు నెల్లకు కుక్కలు మొరిగినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications