హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోట్ల రూపాయల రేడియంట్ స్కామ్ లో కెవిపి పాత్ర?

By Pratap
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao
హైదరాబాద్: రేడియంట్ సంస్థకు అతి తక్కువ ధరకు విశాఖపట్నంలో భూమిని కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావు చక్రం తిప్పారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆరోపించింది. రేడియంట్ పై విశాఖపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ అంతు లేని ప్రేమను ప్రదర్సించడంలో కెవిపి పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ వార్తాకథనం ప్రచురితమైంది. అక్రమాలకు కెవిపి చక్రం తిప్పారని అనుమానించింది. 300 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కేవలం 30 లక్షల రూపాయలకే రేడియంట్ కు ఇచ్చారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆరోపించింది. రోడ్డును ధారాదత్తం చేశారని, భవనాల ఎత్తుకూ మినహాయింపు ఇచ్చారని వ్యాఖ్యానించింది.

తొలి ఒప్పందం ఫైలు మాయమైందని, ఈ కుంభకోణంలో ఇద్దరు అధికారులు కీలక పాత్ర వహించారని అంటూ వారికి బినామీల పేరిట వాటాలు ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. వైజాగ్ ఎమ్మార్ లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పింది. మొత్తం 50 ఎకరాలు ఒకే బిట్ గా ఉండాలని రియల్టర్ కోరగానే రోడ్డును సైతం లే అపుట్ నుంచి మాయం చేశారని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. రేడియంట్ డెవలపర్స్ కు రుషికొండలోని తారకరామా లేఅవుట్ లో అప్పనంగా ఈ భూమిని కేటాయించినట్లు ఆంధ్రజ్యోతి ఆరోపించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X