ఎమార్ పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలి: డిఎల్ రవీంద్రారెడ్డి

DL Ravindra Reddy
హైదరాబాద్: ఎమార్ సంస్థల అక్రమాలపై నిజాలు నిగ్గు తేలాలంటే వెంటనే సిబిఐ ఎంక్వయిరీ వేయాలని కాంగ్రెసు నాయకుడు డిఎల్ రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బిపి ఆచార్య, పార్థసారథిలను అక్రమాలకు ప్రేరేపించింది ఎవరో బహిర్గతం కావాల్సి ఉందన్నారు. ఎమార్ అక్రమాల పుట్ట వెనుక ఉన్న ఆ అదృశ్యశక్తులు ఎవరో బయటపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోని వస్తాయన్నారు. ఇప్పటికే ఒక ప్రముఖ దినపత్రిక ఎమార్-ఏపిఐఐసి కుంభకోణాలను పూర్తిస్థాయిలో వెలుగులోకి తెచ్చిందని, అందులో ఆధారాలతో సహా బయట పెట్టారన్నారు.

సిబిఐ విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ఈ అక్రమాలపై సిబిఐ ఎంక్వయిరీ కోసం ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడుతానని ఆయన తెలిపారు. ఎమార్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీఐఐసి గంగవరం ఎయిర్ పోర్టు భూముల వ్యవహారంలో 1.60 కోట్లు నష్టపోయిందన్నారు. ఇక్కడ ఎకరాకు 20 లక్షల రూపాయలు పలుకుతుంటే కేవలం 4 లక్షల రూపాయలకు మాత్రమే ఎకరా భూమిని ఎమార్ కు కేటాయించిందన్నారు. సోలిసిటర్ జనరల్, నిపుణుల నివేదిక ఆధారంగా ఆ భూమిని వెనక్కు తీసుకోవాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+