మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి రోజులు దగ్గర పడ్డాయి: తెరాస నేత హరీష్ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
మెదక్: ప్రజారాజ్యం అధ్యక్షుడు, మెగాస్టార్ చిరంజీవికి ఇక రోజులు దగ్గర పడ్డాయని తెరాస నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. చిరంజీవి తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చుకు తింటున్నారని, తెలంగాణకు చిరంజీవి అనుకూలమైతే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా లేకపోతే చిరంజీవిని తెలంగాణలో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు. ఒకవేళ తెలంగాణ ప్రజల మాట ఖాతరు చేయకుండా తిరగాలని చూస్తే ఇక్కడి ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలో తిరగాలన్నా, రాజకీయాల్లో కొనసాగాలని ఉన్నా చిరంజీవి వెంటనే తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాలన్నారు.

త్వరలో తెలంగాణ వస్తుందని చిరంజీవితో పాటు సమైక్యాంధ్రలో తెలంగాణ వారిని మోసగించిన ఎవ్వరినీ వదలమన్నారు. అందరినీ ఆధారాలతో నిరూపించి బోనులో నిలబెడతామని, దానికి వారు సిద్ధంగా ఉండాలన్నారు. మోసం చేసిన వారు ఎంతటి వారైలా వదిలేది లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X