వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యపై అలహాబాద్ హైకోర్టు తీర్పునకు సుప్రీంకోర్టు బ్రేక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: అయోధ్య కేసు వాయిదా పడింది. మన దేశంలో త్వరలో జరగబోతున్న కామల్ వెల్త్ క్రీడలు, బీహార్ ఎన్నికల దృష్ట్యా కేసును వాయిదా వేయాలని ఉత్తర ప్రదేశ్ కు చెందిల రమేశ్ త్రిపాఠి అనే వ్యక్తి బుధవారం సుప్రీం కోర్టులో పిల్ వేశాడు. రమేశ్ త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. మొదట సుప్రీం కోర్టు నిన్న ఆయనతో విభేదించింది. కేసు వాయిదా వేయడానికి ససేమీరా అన్నది. గురువారం మరోసారి పరిశీలించిన సుప్రీంకోర్టు త్రిపాఠీ పిల్ ను సరియైనదిగా భావించి తీర్పును వారంపాటు వాయిదా వేయాల్సిందిగా అలహాబాద్ కోర్టును ఆదేశించింది. దీంతో తీర్పు 28వ తేదికి వాయిదా పడింది.

దేశం రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక కామన్ వెల్త్ క్రీడలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటుందని ఆయన త్రిపాఠీ తరఫున న్యాయవాది చెప్పారు. దాంతో పాటు బీహార్ ఎన్నికలను కూడా ఉటంకించారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఉగ్రవాదులు విదేశీ పర్యాటకులపై కాల్పులు జరిపిన నేపథ్యంలో అయోధ్య తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే కామన్ వెల్త్ క్రీడలకు వచ్చే విదేశీయులను, క్రీడాకారులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశాలుంటాయని, అతి సున్నితమైన అయోధ్య విషయంపై ఇలాంటి సందర్భంలో తీర్పు వస్తే దేశంలో అల్లరిమూకలు చెలరేగే అవకాశముందని భానిస్తున్నారు. అంతే కాకుండా రెండు వర్గాల వారిని మానసికంగా సిద్ధం చేయడానికి సైతం కేంద్రానికి సమయం ఉంటుంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ ప్రభుత్వం కూడా తీర్పు వాయిదా వేయాలని కోరిని విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X