విహెచ్ ఎమ్మార్ ప్రాపర్టీస్ స్కామ్ లో వైయస్సార్ టార్గెట్ చేశారా?

రైతుల భూములను చాలా తక్కువ ధరకు ఎమ్మార్ ప్రాపర్టీస్ కు ఎపిఐఐసి సేకరించి ఇచ్చిందని, ఆ భూముల పక్కన వ్యక్తిగతంగా ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య వంటివారు భూములు కొనుక్కున్నారని, వీధులకు బిపి ఆచార్య పేర్లు పెట్టుకున్నారని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో ఎపిఐఐసిని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన అన్నారు. ఇంత అన్యాయం జరిగినా కూడా తాము నోరు విప్పకపోతే కాంగ్రెసుకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో తమకు పైసా రాలేదు, తాము పైసా పెట్టలేదని, దీని వెనక కింగ్ మేకర్ ఉన్నారని శరత్ గుప్తా అనే వ్యక్తి తనకు చెప్పాడని విహెచ్ అన్నారు. రైతుల భూములు తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్న నవీన్ మిట్టల్ పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications