తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల లోయలో పడిన యువతి: రక్షించేందుకు అధికారుల యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: తిరుమల నడకదారిలో ఓ లోయలో ఒక యువతి అదుపు తప్పి లోయలో పడింది. నడక దారిలోని ఆవ్వాచారి కొనవద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొదట సుమారు 40 అడుగుల లోతులో పడిందనుకున్నప్పటికీ, ఆమె కనిపించక పోవటంతో కనీసం 150 అడుగుల లోతులో ఉండి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆమెని రక్షించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. యువతి వయసు 25 నుండి 30 మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే అదుపు తప్పడమే కాకుండా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా పూనుకోవచ్చనే పలువురు భావిస్తున్నారు. ఆమె కోసం అక్కడ ఎవ్వరూ అడగక పోవడంతో ఆమె ఒక్కర్తే వచ్చినట్టు భావిస్తున్నారు. ఆమె లోయలో పడే సమయంలో ఓ వ్యక్తి చూసి సమాచారమిచ్చారు. ఆమెను రక్షించడానికి అధికారాలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు.

కాగా వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో గుంటూరుకు చెందిన వ్యక్తి లోయలో పడిపోయాడు. వారం గడువక ముందే ఇదే స్థలంలో మరో దుర్ఘటన చేసుకోవటంతో పలువురు దేవస్థానం భద్రతపై మండిపడుతున్నారు. ఆ మూల మీద భద్రత కొరవైందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X