హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పండు నందమూరి హరికృష్ణ అనుచరుడు, పరిటాల రవి మనిషి

By Pratap
|
Google Oneindia TeluguNews

Harikrishna
హైదరాబాద్: దారుణ హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు చలసాని వెంకటేశ్వర రావు అలియాస్ పండు రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు దగ్గరి అనుచరుడు. గతంలో హత్యకు గురైన తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి మనిషి. పండు గతంలో పరిటాల రవితో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత విజయవాడకు మకాం మార్చి నందమూరి హరికృష్ణకు సన్నిహితమయ్యారు. పండు రెండు సార్లు ఉయ్యూరు నుంచి, ఒకసారి పెనమలూరు నుంచి శాసనసభకు పోటీ చేశారు. మొదటి సారి స్వతంత్ర అభ్యర్థిగా, రెండు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.

పండుకు నందమూరి హరికృష్ణనే తెలుగుదేశం టికెట్ ఇప్పించినట్లు చెబుతారు. హరికృష్ణ టికెట్ ఇప్పించినప్పటికీ ఆయన విజయం సాధించలేకపోయారు. పండుకు పార్టీ టికెట్ ఇవ్వడం పల్ల మరో తెలుగుదేశం నాయకుడు విజయవాడకు చెందిన దేవభక్తుని సుబ్బారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిటాల రవి వద్ద పనిచేసినందుకే పండు హత్య జరిగి ఉండవచ్చునని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పండు హత్య వెనక రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X