హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి నేత చలసాని పండును మహేందర్ రెడ్డి చంపాడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు చలసాని వెంకటేశ్వర రావు అలియాస్ పండును మహేందర్ రెడ్డియే హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహేందర్ రెడ్డి ఆదివారం రాత్రి ఆపార్టుమెంట్ గోడ దూకి పారిపోయినట్లు స్పప్నిక అపార్టుమెంట్ వాచ్ మన్ చెబుతున్నాడు. ఏదో తక్షణంగా పని ఉండి తనను లేపడమెందుకని అనుకుని మహేందర్ రెడ్డి గోడ దూకిపోయినట్లు అనుకున్నానని, తనకు హత్య జరిగిందనే అనుమానం రాలేదని అతను చెబుతున్నాడు. హైదరాబాదులోని యూసుఫ్ గుడా మధురానగర్ లో గల స్వప్నిక అపార్టుమెంటు నాలుగో అంతస్థులో పండు హత్య జరిగింది. ఆర్థికలావాదేవీల గొడవలే పండు హత్యకు కారణమై ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మహేందర్ రెడ్డి గత 15 ఏళ్లుగా పండుకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇద్దరు కలిసే అపార్టుమెంటుకు వచ్చారు. మహేందర్ రెడ్డి కారు ఆపార్టుమెంటులోనే ఉందని వాచ్ మన్ చెప్పాడు. మహేందర్ రెడ్డి సెల్ డిశ్చార్జి అయి ఉంది. పండు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోని గొడవలే పండు హత్యకు కారణమై ఉండవచ్చుని పోలీసులంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X