హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహేందర్ రెడ్డి ఇంట్లో రక్తం మరకల బనియన్ లభ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాద్ కూకట్ పల్లిలోని బాలాజీనగర్ లో గల మహేందర్ రెడ్డి ఇంట్లో రక్తం మరకల బనియన్ పోలీసుల చేతికి చిక్కింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు పండు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న మహేందర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆ బనియన్ దొరికింది. మహేందర్ రెడ్డి పండును హత్య చేసిన తర్వాత ఇంటికి వచ్చి బట్టలు మార్చుకున్నట్లు, భార్యను ఎక్కడికో పంపించివేసినట్లు, ఆ తర్వాత పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, మహేందర్ రెడ్డి ముందు వేసుకున్న పథకం ప్రకారం కూకట్ పల్లి పోలీసులకు లొంగిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

కూకట్ పల్లి పోలీసులకు లొంగిపోయిన మహేందర్ రెడ్డిని, అదుపులోకి తీసుకున్న మరో ఇద్దరిని హైదరాబాద్ నేరపరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులు విచారిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మహేందర్ రెడ్డితో పాటు బత్తిని, మరో వ్యక్తి సిసిఎస్ పోలీసులో అదుపులో ఉన్నట్లు చెబుతున్నారు. వరంగల్ జిల్లాలోని మహేందర్ రెడ్డి స్వగ్రామంలో కూడా పోలీసులు సోదాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, మహేందర్ రెడ్డి నక్సలైట్ నాయకుడు సమ్మిరెడ్డి సోదరుడని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X