హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి నేత పండు హత్య కేసు: ఎవరీ మహేందర్ రెడ్డి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: తెలుగుదేశం నాయకుడు పండు హత్య కేసులో మహేందర్ రెడ్డి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డి విజయవాడకు చెందిన చలసాని పండుకు మధ్య అంత సాన్నిహిత్యం ఎలా పెరిగిందనేది కొంత ఆశ్చర్యకమైన విషయమే. మహేందర్ రెడ్డి అసలు పేరు మహిపాల్ రెడ్డి అని తెలుస్తోంది. మహిపాల్ రెడ్డి పేరు మీద అతనిపై కృష్ణా జిల్లా ఉయ్యూరు పోలీసు స్టేషనులో రౌడీ షీట్ ఉంది. మహేందర్ రెడ్డిపై పలు కేసులున్నాయి. తొలిసారి ఒక అత్యాచారం కేసులో అతను అరెస్టయ్యాడు.

1988లో మహేందర్ రెడ్డికి పండుకు, ప్రస్తుత కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూకు హైదరాబాదు జైలులోని ముషీరాబాద్ జైల్లో పరిచయం అయినట్లు సమాచారం. క్రమంగా పండుకు మహేందర్ రెడ్డి దగ్గరవుతూ వచ్చాడు. వారిద్దరికి మహేందర్ రెడ్డి మసాజ్ చేసేవాడని, దానివల్లనే అతనికి మసాజ్ రెడ్డి అనే పేరు వచ్చిందని అంటారు. గత 15 ఏళ్లుగా పండుకు నమ్మినబంటుగా ఉంటూ వచ్చాడు. పలువురు నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు మసాజ్ రెడ్డి చూస్తున్నాడని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X