వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని డిఎస్ పరోక్ష హెచ్చరిక

పార్టీ నాయకుల మధ్య సమన్వయం కోసం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చునని, అయితే వాటిని పార్టీ వేదికల మీదనే వెల్లడించాలని, మీడియాకు ఎక్కి బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతితో దిగ్భ్రాంతికి గురై మరణించినవారి జాబితాను పార్టీ నాయకులకు అందించామని, ఆ జాబితాను సరి చూసి ధ్రువీకరించుకుని మరో జాబితాను జిల్లా నాయకులు ఇస్తారని, దాని ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు భూస్థాపితమైందని అనడం శాసనసభ్యురాలు కొండా సురేఖకు తగదని ఆయన అన్నారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో పలువురు సూచించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడు, మంత్రి దానం నాగేందర్ కోరారు.












Click it and Unblock the Notifications