వైయస్ జగన్ వ్యూహం వల్లనే రెచ్చిపోతున్న కొండా సురేఖ

Konda Surekha
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యూహంలో భాగంగానే శాసనసభ్యురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ రెచ్చిపోతున్నట్లు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న జగన్ ఓదార్పు యాత్రలో ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతకు ముందు ఆమె ముఖ్యమంత్రి కె. రోశయ్యపై ధ్వజమెత్తారు. రోశయ్య చిల్లరగా వ్యవహరిస్తున్నారని, వైయస్సార్ విగ్రహాల ప్రతిష్టాపనను అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు. తాజాగా ఆమె కాంగ్రెసు పార్టీపైనే వ్యాఖ్యానాలు చేశారు. వైయస్ జగన్ తప్ప కాంగ్రెసు పార్టీకి గతి లేదనే పద్ధతిలో ఆమె మాట్లాడారు.

అధిష్టానం వైయస్ జగన్ ను ఇది విధంగా విస్మరిస్తే కాంగ్రెసు పార్టీకి 2014లో జరిగే ఎన్నికల్లో ఒక్క శాసనసభా సీటు కూడా రాదని, పార్లమెంటు సీటు కూడా రాదని ఆమె అన్నారు. తన మాటలు నిజమవుతాయని ఆమె అన్నారు. వైయస్ జగన్ సామర్థ్యాన్ని గుర్తిస్తేనే కాంగ్రెసుకు భవిష్యత్తు ఉంటుందని సురేఖ అన్నారు. రాష్ట్రంలో జగన్ కు అత్యున్నత పదవి ఇస్తే తప్ప లాభం లేదని ఆమె అన్నారు. ఆ అత్యున్నత పదవి ఏమిటనేది అందరికీ తెలిసిందే.

వైయస్ జగన్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆయన అనుచురులు కూడా జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆ విషయాన్ని బహిరంగంగానే వెల్లడించారు. అయితే, జగన్ అనుచరులు అలా మాట్లాడడం వెనక ఓ వ్యూహం ఉందని భావిస్తున్నారు. అధిష్టానాన్ని రెచ్చగొట్టడమే వారి అభిమతంగా చెబుతున్నారు. కొంత మంది వ్యూహాత్మకంగానే పార్టీపై విమర్శలు చేస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అనడంలోని ఆంతర్యం బహుశా ఇదే అయి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+