యెడ్యూరప్ప ప్రభుత్వానికి పొగ పెడుతున్న గాలి జనార్దన్ రెడ్డి

కాగా, అసమ్మతి సెగలు పెల్లుబుకుతున్న ప్రస్తుత నేపథ్యంలో యెడ్యూరప్ప బుధవారం మంత్రి వర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరు కావాలని ఆయన ఆదేశించారు. గాలి సోదరులతో పాటు ఆయన వర్గానికి చెందిన మంత్రులు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇటీవల యెడ్యూరప్ప మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టారు. కొంత మంది మంత్రులను తొలగించి తన మద్దతుదారులకు మంత్రి పదవులు ఇచ్చారు. అప్పటి నుంచి గాలి సోదరులు ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు సమాచారం.
గతంలో కూడా యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని కూల్చేందుకు గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులో ఆయన శాసనసభ్యుల క్యాంప్ నిర్వహించారు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించింది. గాలి జనార్దన్ రెడ్డి డిమాండ్ కు యెడ్యూరప్ప దిగి వచ్చారు. దాంతో అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి వెనక్కి తగ్గారు.












Click it and Unblock the Notifications