హైకోర్టు నిర్ణయం నేడే: ఢిల్లీకి మారుతున్న కర్ణాటక సీన్

Yedyurappa
బెంగళూర్: కర్ణాటక రాజకీయం మంగళవారం నిర్ణయాత్మక దశకు చేరుకోనుంది. 16 మంది శాసనసభ్యులపై స్పీకర్ బోపయ్య వేసిన అనర్హత వేటుపై హైకోర్టు మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరిస్తుందని భావిస్తున్నారు. ఈ కేసు విచారణకు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేర్, జస్టిస్ ఎన్ కుమార్ లతో ప్రత్యేకంగా డివిజన్ బెంచ్ ఏర్పాటైంది. తిరుగుబాటు శాసనసభ్యులు దాఖలు చేసిన రెండు పిటిషన్లపై ఈ బెంచ్ విచారణ జరుపుతుంది.

కాగా, కర్ణాటక రాజకీయ నాటకం ఢిల్లీకి మారనుంది. ముఖ్యమంత్రి యెడ్యూరప్ప తనకు మద్దతిస్తున్న శాసనసభ్యులతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. గవర్నర్ భరద్వాజ్ తీరుపై ఢిల్లీలో ఫిర్యాదు చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు. అవసరమైతే రాష్ట్రపతి ఎదుట బలప్రదర్శన చేయాలనేది ఆయన ఉద్దేశం. యెడ్యూరప్ప ప్రభుత్వం నాటకీయంగా సోమవారం బలప్రదర్శనలో నెగ్గింది. అయితే, అది బూటకమని, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని గవర్నర్ భరద్వాజ్ కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో ఆరోపించారు. కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యెడ్యూరప్ప తన పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, నాయకులతో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+