గాలి జనార్దన్ రెడ్డిపై కర్ణాటక గవర్నర్ భరద్వాజ్ కామెంట్

Bharadwaj
బెంగళూర్: కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక మైనింగ్ మాఫియాతో, అవినీతితో విసిగిపోయానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప సర్కారు ఇబ్బందుల్లో పడటం ఇదే మొదటి సారి కాదని భరద్వాజ్ చెప్పారు. గతంలో ఒకసారి 50 మంది ఎమ్మెల్యేలను గాలి జనార్దనరెడ్డి సోదరులు హైజాక్ చేశారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి పాలన విధించాలని తాను చేసిన సిఫారసు పక్షపాతమన్న ఆరోపణలను తిప్పికొట్టారు. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు యడ్యూరప్ప సర్కారుకు ఆయన మరో అవకాశం ఇచ్చారు. గురువారం ఉదయం 11 గంటలకు మరోసారి తన మెజార్టీ నిరూపించుకోవాలని కోరారు. రాజ్యాంగ బద్ధంగా సభలో మరోసారి మెజార్టీ నిరూపించుకోవాల్సిందిగా కోరుతూ తాను యడ్యూరప్పకు లేఖ రాశానని తెలిపారు. విశ్వాసతీర్మానంపై స్పష్టమైన విభజన లేనందున సోమవారం జరిగిన బల పరీక్ష ప్రహసనమని అన్నారు. కీలక సందర్బాల్లో విశ్వాస తీర్మానంలో మూజువాణి ఓటు ఆమోదయోగ్యం కాదన్నారు.

రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడంపై అడిగిన ప్రశ్నకు.. అది ఆ రోజు సభలో జరిగిన ప్రొసీడింగ్స్ ఆధారంగా ఇచ్చినదేనన్నారు. తన ప్రభుత్వం పట్ల గవర్నర్ వైఖరి సముచింగా లేదన్న యడ్యూరప్ప ఆరోపణలను ఆయన కొట్టిపారేస్తూ... "అప్పట్లో ముఖ్యమంత్రి కన్నీళ్లపర్యంతం అయ్యారు. ఆయనపై నాకు సానుభూతి ఉంది. చాలా అంశాల్లో ముఖ్యమంత్రికి నేను పూర్తి సహాయ సహకారాలు అందించాను'' అంటూ గాలి సోదరుల తిరుగుబాటును ప్రస్తావించారు. ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికైన వారు ఎవరూ కర్ణాటకలో లేరని ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్ ఏజెంట్‌ను అంటూ బీజేపీ చేసిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం బీజేపీ తీవ్ర మానసిక వేదనలో ఉందని అన్నారు. "నా విధి కర్ణాటక ప్రజలకు సేవ చేయడం. అంతేకానీ.. రాజకీయ పార్టీలకు, కొందరు వ్యక్తులకు కాదు.'' అని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+