రోశయ్య మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ వేసిన వైయస్ జగన్ ఫోబియా

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఫోబియా పట్టుకున్నట్లుంది. మంత్రివర్గ విస్తరణ జరిపితే శాసనసభ్యుల్లో అసమ్మతి రాజుకునే ప్రమాదం ఉందని అధిష్టానం గుర్తించి బ్రేకులు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులు ఆశిస్తున్నవారు ప్రస్తుతం 30, 40 మంది దాకా ఉన్నారు. కొత్తగా పది మందికి తప్పించి కొత్తగా ఎక్కువ మంది స్థానం కల్పించడానికి రోశయ్యకు అవకాశం లేకుండా పోయింది. దీంతో మంత్రివర్గ విస్తరణ చేపడితే కొత్త తలనొప్పిని ఎదుర్కోవాల్సి ఉంటుందనేది కాంగ్రెసు అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. అందుకే, రోశయ్య మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు.

సీనియర్ శాసనసభ్యులు జెసి దివాకర్ రెడ్డి, కె. జానారెడ్డి వంటివారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేక వర్గీయులకు స్థానం కల్పించారని ఓ వర్గం ఆగ్రహానికి గురి కావచ్చుననే అభిప్రాయం కూడా ఉంది. ఒకరిద్దరి కోసం మంత్రివర్గ విస్తరణ చేపట్టి కష్టాలు కొనితెచ్చుకోవడం ఎందుకనే భావన నెలకొని ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, వైయస్ జగన్ ఓదార్పు యాత్ర విషయంలో పార్టీ ఆదేశాలను ధిక్కరించిన మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లపై చర్యలు తీసుకోకపోతే అలుసై పోయే ప్రమాదం ఉందని కూడా గుర్తించారు. అయినా సరే, కొంత కాలం అలా వదిలేయడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు చెబుతున్నారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా మంత్రివర్గ విస్తరణకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొయిలీ ఉన్నంత వరకు విస్తరణకు దూరంగానే ఉండాలని కూడా రోశయ్య అనుకుంటున్నట్లు తెలుస్తోది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+